స్వేచ్ఛగా ఆడగలిగాము -లుస్

దిశ, వెబ్‎డెస్క్: బుధవారం షార్జాలో జరిగిన మ్యాచ్ లో వెలాసిటీ టీమ్ నుండి బరిలో దిగిన సునీ లుస్ (37) ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 21 బంతుల్లో ఒక సిక్స్, 4 ఫోర్ల సహాయంతో 37 పరుగులు జోడించింది. చివర్లో లుస్ ఫోర్ కొట్టడంతో వెలాసిటీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సునీ లుస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. మ్యాచ్ అనంతరం లుస్ మాట్లాడుతూ… నేను బ్యాటింగ్‌కు […]

Update: 2020-11-04 21:30 GMT

దిశ, వెబ్‎డెస్క్: బుధవారం షార్జాలో జరిగిన మ్యాచ్ లో వెలాసిటీ టీమ్ నుండి బరిలో దిగిన సునీ లుస్ (37) ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 21 బంతుల్లో ఒక సిక్స్, 4 ఫోర్ల సహాయంతో 37 పరుగులు జోడించింది. చివర్లో లుస్ ఫోర్ కొట్టడంతో వెలాసిటీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సునీ లుస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది.

మ్యాచ్ అనంతరం లుస్ మాట్లాడుతూ… నేను బ్యాటింగ్‌కు వెళ్లే సమయానికి జట్టు ఒత్తిడిలో ఉన్నది. అందుకే ముందు స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు రాబట్టాము. పిచ్ పరిస్థితి అర్థమయ్యాక ఇక మేం స్ట్రైక్ చేశాము. అందుకే స్వేచ్ఛగా ఆడగలిగాము. ఇలాంటి టోర్నీలు మహిళల కోసం మరిన్ని ఏర్పాటు చేయాలి అని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News