‘కవిత గెలుపు ఓర్వలేకే.. అర్వింద్ తప్పుడు ప్రచారం‘

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితపై అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల నిజామాబాద్ పట్ట‌ణంలోని ధ‌ర్నాచౌక్ వ‌ద్ద ఆయన దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. అంతేగాకుండా జ‌గిత్యాల జిల్లాలోని మెట్‌ప‌ల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద కూడా అర్వింద్ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయ‌కులు ద‌హ‌నం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజామాబాద్‌ స్థానిక సంస్థల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్సీ కవితపై […]

Update: 2020-12-24 03:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితపై అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల నిజామాబాద్ పట్ట‌ణంలోని ధ‌ర్నాచౌక్ వ‌ద్ద ఆయన దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. అంతేగాకుండా జ‌గిత్యాల జిల్లాలోని మెట్‌ప‌ల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద కూడా అర్వింద్ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయ‌కులు ద‌హ‌నం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజామాబాద్‌ స్థానిక సంస్థల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నాయకులు ఓర్వలేకే తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని మండిపడ్డారు. మహిళ అని చూడకుండా కించపరుస్తూ మాట్లాడిన అర్వింద్‌ మహిళా జాతిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న అర్వింద్‌ను తెలంగాణ మహిళలు క్షమించరని, ఆయనను తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.

Tags:    

Similar News