Video: రోడ్డుపై డాన్స్‌తో నిరసన తెలిపిన టాలీవుడ్ హీరోయిన్.. కారణం తెలిస్తే శభాష్ అనాల్సిందే

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటన దేశాన్నే కుదిపేసింది. ఈ ఘటనపై దేశ నలుమూలల నిరసనలు వ్యక్తమయ్యాయి.

Update: 2024-09-18 04:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటన దేశాన్నే కుదిపేసింది. ఈ ఘటనపై దేశ నలుమూలల నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే చాలా మంది ఈ ఘటనను ఖండిస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ డాక్టర్‌ హత్యాచార ఘటనను నిరసిస్తూ.. రోడ్డు పైకి వచ్చి డాన్స్ చేసింది. వివరాల్లోకి వెళితే..

బేసిక్‌గా హీరోయిన్స్.. ఏదైనా ఫంక్షన్స్, ప్రమోషన్స్, లేదా షాపింగ్ మాల్ ఓపినింగ్స్ టైంలోనే బయటకు రావడం మనం చూస్తుంటాం. ఇక ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి కామ్ అయిపోతారు. కానీ, బెంగాలీకి చెందిన హీరోయిన్ మోక్షా సేన్‌గుప్తా అలా కాదు. ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటనను నిరసిస్తూ ప్రజలతో కలిసి రోడ్డు పైకి వచ్చి డాన్స్ చేస్తూ నిరసన తెలిపింది. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అయిపోయింది. అది చూసిన నెటిజన్లు.. ఈమె లానే సినీ సెలబ్రెటీలు కూడా బయటకు వచ్చి నిరసన తెలిపితే గవర్నమెంట్ త్వరగా రియాక్ట్ అవుతుందని, మోక్షా సేన్‌గుప్తాను పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. 'నీతోనే నేను', 'అలనాటి రామచంద్రుడు', 'ఐ హేట్‌ యూ' వంటి చిత్రాల్లో నటించింది. ఇక రీసెంట్‌గా ధనరాజ్, సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రామం రాఘవం’ మూవీలోనూ ఈ అమ్మడు నటించింది. కాగా ఈ మూవీ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నది.

(video link credits to Sheela Bhatt शीला भट्ट X account)


Similar News