సిరిపూర్ పేపర్ మిల్లులో ట్రాన్స్ఫార్టర్ బ్లాస్ట్..

దిశ, బెజ్జుర్ : కాగజ్ నగర్ పట్టణంలోని సిరిపూర్ పేపర్ మిల్లులో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. పేపర్ మిల్లులోనే 132 కేవీ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదవశాత్తు పేలింది. ఈ సమయంలో మొదటి షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. కాగజ్ నగర్ పట్టణంలోని కాపువాడకు చెందిన లక్ష్మీనారాయణ, మండలంలోని అందెవెళ్లి గ్రామానికి చెందిన మోహన్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, వీరిలో మోహన్ రావు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం […]

Update: 2021-11-11 07:35 GMT

దిశ, బెజ్జుర్ : కాగజ్ నగర్ పట్టణంలోని సిరిపూర్ పేపర్ మిల్లులో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. పేపర్ మిల్లులోనే 132 కేవీ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదవశాత్తు పేలింది. ఈ సమయంలో మొదటి షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. కాగజ్ నగర్ పట్టణంలోని కాపువాడకు చెందిన లక్ష్మీనారాయణ, మండలంలోని అందెవెళ్లి గ్రామానికి చెందిన మోహన్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, వీరిలో మోహన్ రావు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News