నరసింహ స్వామి ఆలయంలో భారీ చోరీ...
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని నరసింహ నగర్ లో గల నరసింహ స్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరికి పాల్పడ్డారు.
దిశ, భైంసా : నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని నరసింహ నగర్ లో గల నరసింహ స్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరికి పాల్పడ్డారు. ఆలయ అర్చకులు, స్థానికులు పేర్కొన్న వివరాలు ప్రకారం స్వామివారి మూడున్నర కిలోల వెండి మకరతోరణం, 29 తులాలు వెండి కిరీటం, ఆలయంలో గల హుండి క్రింది భాగంలో చిన్నపాటి రంధ్రం చేసి డబ్బులు సైతం తీశారని పేర్కొన్నారు. మొదట చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తును ప్రారంభించారు.