టాలీవుడ్ డ్రగ్స్ కేసు: మొన్న రకుల్.. నేడు నందు.. అంత తొందరెందుకు..?

దిశ, వెబ్‌డెస్క్: గతంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. డ్రగ్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారంతో పలువురు సినీ ప్రముఖులకు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్)  సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో ఈడీ వారిని విచారిస్తోంది. ఇక ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాధ్, నటి ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్ ని విచారించిన ఈడీ  పలు సమాచారాన్ని రాబట్టింది. […]

Update: 2021-09-07 02:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: గతంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. డ్రగ్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారంతో పలువురు సినీ ప్రముఖులకు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో ఈడీ వారిని విచారిస్తోంది. ఇక ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాధ్, నటి ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్ ని విచారించిన ఈడీ పలు సమాచారాన్ని రాబట్టింది. ఇక తాజాగా నటుడు నందు ఈడీ ముందు హాజరయ్యాడు.

నందు విచారణ ఈ నెల 20న జరగాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన నందు ఈరోజు విచారణకు హాజరయినట్లు తెలుస్తోంది. నందు బ్యాంకు ఖాతాల‌ను పరిశీలించి, అనుమానాస్ప‌ద లావాదేవీల‌పై ప్ర‌శ్నిస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో రకుల్, ఇప్పుడు నందు ఈడీ ఇచ్చిన తేదీల కన్నా ముందే విచారణకు హాజరుకావడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిజంగానే వారి పర్సనల్ ప్రాబ్లెమ్స్ వలన వారు విచారణకు ముందు వచ్చారా..? లేక మరేదైనా కారణం ఉందా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

Tags:    

Similar News