మలేషియా ఓపెన్ సిరీస్‌లో దూసుకెళ్తున్న ప్రణయ్..

కౌలాలంపూర్ : మలేషియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుడు హెచ్.ఎస్ ప్రణయ్ శుభారంభం చేశాడు.

Update: 2022-06-28 13:09 GMT

కౌలాలంపూర్ : మలేషియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుడు హెచ్.ఎస్ ప్రణయ్ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రణయ్ 21-14, 17-21, 21-18 తేడాతో మలేషియా‌కు చెందిన డారెన్‌ను చిత్తు చేశాడు. తొలి రౌండ్‌లో పూర్తి ఆధిపత్యం కొనసాగించిన ప్రణయ్‌కు రెండో రౌండ్‌లో ప్రత్యర్థి షాక్ ఇచ్చాడు. ప్రణయ్ సైతం పోటీనిచ్చిప్పటికీ ఆ సెట్‌ను డారెన్ కైవసం చేసుకున్నాడు. ఇక, నిర్ణయాత్మక మూడో సెట్‌లో ప్రణయ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. డారెన్ సైతం తగ్గకపోవడంతో ఆ సెట్ హోరాహోరీగా సాగింది. ఈ నేపథ్యంలో ప్రణయ్ మూడో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుని రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.

మరో మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు సాయి ప్రణీత్, సమీర్ వర్మ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. ప్రణీత్ 15-21, 21-19, 9-21 తేడాతో 6వ సీడ్, ఇండోనేషియా ష్టర్ ఆంథోనీ చేతిలో ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో 7వ సీడ్ జోనాథన్ క్రిస్టీ చేతిలో 21-14, 13-21, 21-87 తేడాతో సమీర్ వర్మ పరాజయం పాలయ్యాడు. ఉమెన్స్ డబుల్స్‌లో అశ్విన్ పొన్నప్ప-సిక్కీ రెడ్డి, హరిత-అస్నా రాయ్, మిక్స్‌డ్ డబుల్స్‌లో వెంకట్ గౌరవ్-జుహీ దేవాంగన్ తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్ర్కమించారు. బుధవారం ఉమెన్స్ సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌తోపాటు పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్‌లో పాల్గొననున్నారు.


Similar News