మళ్లీ పసుపు వార్ స్టార్ట్.. నెట్టింట సీఎం రేవంత్ పోస్ట్ వైరల్..
నిజామాబాద్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో బుధవారం రోజున అత్యధికంగా పసుపునకు రూ.14వేలు రేటు పలికింది.
దిశ, ఆలూర్ : నిజామాబాద్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో బుధవారం రోజున అత్యధికంగా పసుపునకు రూ.14వేలు రేటు పలికింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ మాసంలో జరిగిన ఎలక్షన్ క్యాంపెన్లో ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు ఏర్పాటు చేసి నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే ప్రజలకు శాశ్వతంగా మేలు జరుగుతుందని, తక్షణంగా ఆ దశగా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారిని సీఎం రేవంత్ రెడ్డి ట్విటర్లో డిమాండ్ చేశారు. ఈ ట్విటర్ ట్రోల్స్ను కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని వాట్స్అప్ గ్రూప్లో షేర్ చేస్తున్నారు.