Sitaram Yechury: ఏచూరి భౌతికకాయం ఢిల్లీ ఎయిమ్స్ కు డొనెట్

ఏచూరి భౌతికకాయం ఢిల్లీ ఎయిమ్స్ కు డొనెట్ చేశారు.

Update: 2024-09-12 12:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సీపీఎం ప్రధాన కార్యదర్శి, వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజకీయ, సామాజిక, వామపక్ష, పోరాటాల్లో ఆయన పాత్రను కొనియాడుతున్నారు. అయితే సీతారాం ఏచూరి విషయంలో ఆయన కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ కు డొనేట్ చేశారు. వైద్య విద్యార్థులకు బోధన, పరిశోధనకు ఉపయోగపడేలా ఆయన కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ కాలేజీ ఇన్ చార్జి ఫ్రొఫెసర్ డాక్టర్ రిమా దాదా ఒక ప్రకటన విడుదల చేశారు.  ఏచూరి కుటుంబం తీసుకున్న ఆదర్శ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. 


Similar News