గాంధీభవన్లో బోనాల పండగ.. మహిళా కాంగ్రెస్ నాయకుల సందడి
ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణలో బోనాల సందడి నెలకొంది. పోతురాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో శోభ సంతరించుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణలో బోనాల సందడి నెలకొంది. పోతురాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో శోభ సంతరించుకుంది. ఈ క్రమంలోనే మంగళవారం గాంధీభవన్లో ఘనంగా బోనాల పండగ నిర్వహించారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు అధ్యక్షతన గాంధీభవన్లో బోనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు అమ్మవారికి బోనాలు సమర్పించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ, సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి బోనాలు సమర్పించినట్టు సునీతా రావు వెల్లడించారు.