Breaking : నార్సింగి పోలీస్ స్టేషన్‌లో జానీ మాస్టర్ భార్య..

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ‌‌మాస్టర్ భార్య అయేషా (సుమలత) గురువారం నార్సింగ్ పోలీస్ స్టేషన్‌‌కి వచ్చారు.

Update: 2024-09-19 09:59 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ‌‌మాస్టర్ భార్య అయేషా (సుమలత) గురువారం నార్సింగ్ పోలీస్ స్టేషన్‌‌కి వచ్చారు. ఒక ఫేక్ కాల్‌పై సమాచారం తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్‌కి వచ్చినట్లు ఆమె వెల్లడించారు. కానీ, జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ఆమెను మాట్లాడించడానికి మీడియా ప్రయత్నం చేయగా ఆమె స్పందించలేదు.

కాగా, తనపై జానీ మాస్టర్​ పలుమార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ (21) ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ భార్య సైతం తనపై దాడి చేసిందని ఆ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తన ఇంటికి వచ్చి జానీ భార్య దాడి చేసిందని బాధితురాలు పోలీసుల స్టేట్‌మెంట్‌లో తెలిపింది. మరోవైపు జానీ‌మాస్టర్‌ కేసులో పోలీసులు విచారణ స్పీడ్ పెంచినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న జానీ మాస్టర్‌ని ఇవాళ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కి తరలిస్తున్నారు.


Similar News