Collector : పల్లె దవాఖాన రహదారి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి
ఏటూరునాగారం మండలం రోహిర్ (రోయ్యురు) లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (పల్లె దవాఖాన) కు రహదారి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు.
దిశ,ఏటూరునాగారంః- ఏటూరునాగారం మండలం రోహిర్ (రోయ్యురు) లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (పల్లె దవాఖాన) కు రహదారి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., డిఎంహెచ్ఓ ఆలెం అప్పయ్య తో కలిసి ఏటూరునాగారం మండలం లోని రోహిర్ (రోయ్యురు) లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (పల్లె దవాఖాన) ను సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లడుతూ.. పల్లె దవాఖానకు రహదారి సౌకర్యము లేక గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారం రోజులలో రహదారి నిర్మాణం పూర్తి చేయాలని, ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయాలని, నిరంతర విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుమలత , ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.