యూఎస్ లో తెలుగు విద్యార్థి మృతి..

Update: 2024-08-16 14:28 GMT

దిశ, హనుమకొండ టౌన్ : హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన ఏరుకొండ రాజేష్ 2015లో ఎమ్మెస్ ట్రైనింగ్ చేసేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. 9 సంవత్సరాలుగా అక్కడే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజేష్ మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు అక్కడి నుండి ఫోన్ చేసి చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు ఇంటి వద్ద రోదిస్తున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో తల్లి ఏం చేయాలో తెలియక కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ప్రభుత్వపరంగా రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని రాజేష్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వారి కుటుంబ సభ్యుల వివరాల కోసం 9704123345 ఈ నంబర్ ను సంప్రదించాలని కోరారు.

Tags:    

Similar News