బల్దియా సూపరింటెండెంట్ సస్పెన్షన్

Update: 2024-08-29 03:12 GMT

దిశ, వరంగల్ టౌన్ : గ్రేటర్ వరంగల్ టౌన్ ప్లానింగ్ సూపరింటెండెంట్ జీవన్ రావు సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ మేరకు బుధవారం కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండానే కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని రాజముద్రను ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) ఫ్లెక్సీలో ముద్రించి బల్దియా హెల్ప్ డెస్క్ వద్ద ప్రదర్శించారు. ఈ విషయం సోషల్ మీడియాలో విస్తతంగా వైరలైంది. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. సీఎస్ ఆదేశాల మేరకు మంగళవారం కమిషనర్ అశ్విని తానాజీ వాకడే.. ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్, సూపరింటెండెంట్ జీవన్ కుమార్ కు మెమో జారీ చేశారు. ప్రతిగా వివరణ తీసుకున్న కమిషనర్ తప్పిదానికి బాధ్యుడిని చేస్తూ జీవన్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.


Similar News