కత్తితో అన్నదమ్ములపై దాడి.. ఒకరికి తీవ్ర గాయాలు

Update: 2024-08-15 14:27 GMT

దిశ, నర్మెట్ట : కత్తితో అన్నదమ్ములపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన మండలంలోని వెల్డండ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. మండల ఎస్సై నగేష్ కథనం ప్రకారం... స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకోవడం కోసం బుధవారం రాత్రి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చందాలు వసూలు చేస్తున్నారు. గ్రామానికి చెందిన కంతి స్వామికి గోల్కొండ శ్రీనివాస్ కు మధ్య గొడవ జరిగింది. మరునాడు జెండా ఆవిష్కరణ అనంతరం ఊరి పెద్ద మనుషులు ఇరువురిని పిలిచి విచారిస్తుండగా శ్రీనివాస్ తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. స్వామి అతని తమ్మడు రవి ఎందుకు తిడుతున్నావని వెళ్లి అడగగా శ్రీనివాస్ తన వద్ద ఉన్న కత్తితో స్వామి, రవిపై దాడి చేసాడు. స్వామికి బలమైన గాయం అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ లో నీలిమ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండల ఎస్సై నాగేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News