ఎంజీఎం ఆస్పత్రిలో తోటి మహిళ ఉద్యోగి పై గొలుసులతో కట్టేసి దాడి

ఎంజీఎం ఆస్పత్రిలో పేషంట్ కేర్ విభాగంలో పనిచేస్తున్న సుమలత అనే మహిళపై అదే విభాగానికి యూనియన్ లీడర్ గా వ్యవహరిస్తున్న అలకుంట్ల రాజమ్మ సోమవారం దాడి చేసింది.

Update: 2024-09-09 14:18 GMT

దిశ, వరంగల్ : ఎంజీఎం ఆస్పత్రిలో పేషంట్ కేర్ విభాగంలో పనిచేస్తున్న సుమలత అనే మహిళపై అదే విభాగానికి యూనియన్ లీడర్ గా వ్యవహరిస్తున్న అలకుంట్ల రాజమ్మ సోమవారం దాడి చేసింది. ఆస్పత్రి ఆవరణలో అందరూ చూస్తుండగానే మిట్ట మధ్యాహ్నం సుమలత అనే మహిళ ను రాజమ్మ గొలుసులతో కట్టేసి, నీకు ఎంజీఎంలో ఉద్యోగం పెట్టించింది నేనే కాబట్టి నాకు ప్రతి నెల మామూలు ఇవ్వాలంటూ దాడికి దిగింది. దాడి చేస్తున్న క్రమంలో బాధిత మహిళ సెల్ ఫోన్ పగలగొట్టి తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన మహిళ వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని మట్టేవాడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Similar News