Viral Video: చేపల లారీ బోల్తా.. కొర్రమీన్లను ఏరుకునేందుకు ఎగబడ్డ జనం

చేపల లోడ్ తో వెళుతున్న లారీ బోల్తా పడటంతో చేపలను ఏరుకునేందుకు స్థానిక జనం ఎగబడ్డారు.

Update: 2024-09-24 09:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: చేపల లోడ్ తో వెళుతున్న లారీ బోల్తా పడటంతో చేపలను ఏరుకునేందుకు స్థానిక జనం ఎగబడ్డారు. ఈ ఘటన మహాబూబాబాద్ జిల్లా మరిపెడ వద్ద జరిగింది. ఘటన ప్రకారం ఖమ్మం జిల్లా నుంచి చేపల లోడ్ తో వరంగల్ వైపు వెళుతున్న లారీ.. మార్గమధ్యంలో మరిపెడ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో లారీలోని కొర్రమీను చేపలన్ని రోడ్డున పడ్డాయి. ఈ లోడ్ లారీ జనారన్యంలో పడటంతో బ్రతికున్న చేపలను ఏరుకునేందుకు స్థానిక జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. చేపలను ఏరుకొని తమ వద్ద ఉన్న సంచుల్లో నింపుకున్నారు. ఇందులో జరిగిన తోపులాటలో ఒకరికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో లో ఓ వ్యక్తి చేపలను తీసుకెళ్లేందుకు సంచి లేకపోవడంతో తన వద్ద ఉన్న కూరగాయలను పారబోసి అదే సంచిలో చేపలను నింపుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, చేపలు ఏరుకుంటున్న ప్రజలను చెదరగొట్టారు. అనంతరం ఆ ప్రాంతంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చి, ట్రాఫిక్ క్లియర్ చేశారు.


Similar News