వరద బాధితులకు ‘విన్స్ బయో‌ప్రొడక్ట్స్’ సంస్థ భారీ విరాళం.. సీఎంకు చెక్ అందజేత

తెలంగాణ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి విన్స్ బయో ప్రొడక్ట్స్ సంస్థ రూ. 51 లక్షల విరాళం అందించింది.

Update: 2024-10-04 07:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి విన్స్ బయో ప్రొడక్ట్స్ సంస్థ రూ. 51 లక్షల విరాళం అందించింది. ఆ సంస్థ చైర్మన్ శ్రీదాస్ నారాయణ దాస్ డాగ, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ డాగ శుక్రవారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారిని అభినందించారు.

కాగా, ఇటీవల వచ్చిన వరదలతో తెలంగాణలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరద బాధితులకు అండగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునివ్వడంతో ప్రముఖులు, సెలబ్రీటీలు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులు భారీగా విరాళాలు అందజేస్తున్నారు.


Similar News