Venu Swamy: వేణు స్వామికి ఊహించని షాక్.. నాంపల్లి కోర్టు సంచలన ఆదేశాలు

నటీనటులు, పొలిటికల్ లీడర్ల జాతకాలు చెబుతూ.. నిత్యం వార్తల్లో నిలిచే వేణు స్వామికి ఊహించని షాక్ తగిలింది.

Update: 2024-09-13 09:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: నటీనటులు, పొలిటికల్ లీడర్ల జాతకాలు చెబుతూ.. నిత్యం వార్తల్లో నిలిచే వేణు స్వామికి ఊహించని షాక్ తగిలింది. జాతకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను సైతం మార్ఫింగ్ చేసి వేణు స్వామి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మూర్తి అనే వ్యక్తి ఇటీవలే నాంపల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అదేవిధంగా తనకు హాని తలపెట్టాలని చూస్తున్నట్లుగా బాధితుడు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు బాధితుడి తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. వెంటనే వేణు స్వామిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని జూబ్లీహిల్స్ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది.      


Similar News