కలుషిత నీరు తాగి ఇద్దరుమ మృతి, 30 మందికి అస్వస్థత

కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

Update: 2024-10-13 04:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ నీటిని తాగిన మరో 30 మంది అస్వస్థతకు గురి కావడంతో వారికి ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సంజీవరావుపేటలో మూడు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు ఆగిపోవడంతో గ్రామస్తులంతా ఓ బావిలో నీళ్లు తాగుతున్నారు. ఆ నీరు కలుషిత నీరు కావడంతో ఇప్పటికే ఇద్దరు చనిపోగా 30 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, అనారోగ్యం పాలైన వాళ్లని స్థానిక ఆసుపత్రిలో చేర్చిన అధికారులు చికిత్స అందిస్తున్నారు. అలాగే బావిలోని నీటిని శాంపిల్స్ సేకరించి టెస్టింగ్ కోసం పంపించినట్లు చెబుతున్నారు. 

Similar News