తెలంగాణలో ఇద్దరు ఎస్పీల బదిలీలు.. హైదారాబాద్ టాస్క్ ఫోర్స్‌ డీసీపీ ఆయనే

తెలంగాణలో భారీగా అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో 28 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీచేసిన విషయం తెలిసిందే.

Update: 2024-06-24 11:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో భారీగా అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో 28 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీచేసిన విషయం తెలిసిందే. పలు జిల్లాల ఎస్పీలతో పాటు ఆ స్థాయి అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా మరో ఇద్దరు ఎస్పీలను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్‌ డీసీపీగా వైవీఎస్ సుదీంద్ర నియమితులయ్యారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా పీ సీతారాంను నియమించారు. కాగా, 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News