దామగుండం నేవీ రాడార్ ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు

వికారాబాద్ జిల్లా దామగుండం(Damagundam)లో నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది.

Update: 2024-10-10 16:48 GMT

దిశ, వెబ్ డెస్క్ : వికారాబాద్ జిల్లా దామగుండం(Damagundam)లో నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 15న నేవీ రాడార్ ప్రాజెక్టు పనుల శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా.. దామగుండం రాడార్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ బీర్ సింగ్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆహ్వానం అందజేశారు. దేశ రక్షణలో కీలక భూమిక పోషించే భారత నేవీ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్ట్ పనులు ఈనెల 15న మొదలు కానున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలం దామగుండంలో నేవీ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు చేపడుతోంది. అయితే మరోవైపు ఈ ప్రాజెక్ట్ అపాలంటూ స్థానికులు ధర్నాలు చేస్తున్నారు.    


Similar News