చేప మందు కోసం వెళ్తున్నారా? మీకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త!

మృగశిరకార్తె ప్రారంభం కానున్నదున ఈ నెల 8నుంచి హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

Update: 2024-06-06 12:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మృగశిరకార్తె ప్రారంభం కానున్నదున ఈ నెల 8నుంచి హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ చేపమందు ప్రసాదం అందించేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆస్తమాతో సహా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ చేప మందు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రతి సంవత్సరం బత్తిని ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేప ప్రసాదానికి వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఈ క్రమంలోనే చేప మందుకు వచ్చే వారి కోసం టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.

జూన్ 8, 9వ తేదీల్లో హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్​లో చేప మందు పంపిణీ చేయనున్నారు. తేదీల్లో 130 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ప్రధాన రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్టాండ్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​కు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. వీటితో పాటు దిల్​సుఖ్​నగర్, ఎన్జీవోస్ కాలనీ, మిథాని, ఉప్పల్, చార్మినార్, గోల్కొండ, రాంనగర్, రాజేంద్రనగర్, రిసాల్ బజార్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, పటాన్​చెరు, జీడిమెట్ల, కేపీహెచ్​బీ కాలనీ, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​కు మొత్తం 80 బస్సులు ఏర్పాటు చేశారు. ఈ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే ప్రయాణికులకు దగ్గరలోని బస్​స్టాండు​లో కనుక్కోవాలని సూచించింది.

Tags:    

Similar News