TG GENCO: జెన్కో పరిధిలో కేడర్ స్ట్రెంత్ తేల్చేందుకు కమిటీ

జెన్కో పరిధిలో భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్లలో ఆపరేషన్స్, మెయింటనెన్స్ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న కేడర్ స్ట్రెంత్‌ను తేల్చేందుకు కమిటీని ఏర్పాటు చేశారు.

Update: 2024-08-24 17:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: జెన్కో పరిధిలో భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్లలో ఆపరేషన్స్, మెయింటనెన్స్ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న కేడర్ స్ట్రెంత్‌ను తేల్చేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు జెన్కో సీఎండీ రోనాల్డో రోస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 8 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో డైరెక్టర్లు సచ్చిదానందం, బి.లక్ష్మయ్య, ఏ.అజయ్, వెంకటరాజం, నర్సింగ్ రావు, జగత్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వర్ రావు ఉన్నారు. కాగా, కన్వీనర్‌గా జెన్కో సీజీఎం రాజేంద్రప్రసాద్ కమిటీలో ఉన్నారు. వారం రోజుల్లోగా కేడర్ స్ట్రెంత్ తేల్చి నివేదిక అందించాలని సీఎండీ ఆదేశించారు.


Similar News