TG Assembly: ముమ్మాటికీ ఇది కమీషన్ల ప్రభుత్వమే.. అసెంబ్లీలో ఏలేటి కీలక వ్యాఖ్యలు

ఏడో రోజు అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో భాగంగా రాష్ట్ర అప్పులపై సభలో చర్చ జోరుగా కొనసాగుతోంది.

Update: 2025-03-21 08:47 GMT
TG Assembly: ముమ్మాటికీ ఇది కమీషన్ల ప్రభుత్వమే.. అసెంబ్లీలో ఏలేటి కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఏడో రోజు అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో భాగంగా రాష్ట్ర అప్పులపై సభలో చర్చ జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) మాట్లాడుతూ.. బడ్జెట్‌ (Budget)లో మూలధన వ్యయాన్ని తగ్గిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. బడ్జెట్‌లో సూక్తి ముక్తావళి చాలా ఉందని, వాస్తవాలు చూస్తుంటే ఇది ముమ్మాటికీ కమీషన్ల (Commissions) ప్రభుత్వమేనని అన్నారు. నిధులు లేమితో అన్ని రంగాలు కుదేలు అవుతున్నాయని ఆరోపించారు.

మంత్రులు ప్రతి పనికి కమీషన్లు తీసుకుంటున్నారంటూ సచివాలయం (Secretariat)లో కాంట్రాక్టర్లు (Contractors) చేసిన ధర్నాలు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే కాంగ్రెస్ సర్కార్ (Congress Government) రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మర్చేసిందని.. రాబోయే నాలుగేళ్లు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయకరంగా ఉందన్నారు. ఇప్పటికే రోజుకు సర్కార్ రూ.1,700 కోట్లకు పైగా అప్పులు చేస్తోందని అన్నారు. నిమిషానికి రూ.కోటికి పైమాటేనని కామెంట్ చేశారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో రాష్ట్ర జనాభా 3.54 కోట్లుగా తేలిందని.. ఆ లెక్కన చూస్తే అప్పడే పుట్టిన పసిపాప నుంచి ప్రతి మనిషిపై రుణభారం రూ.2.24 లక్షలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. 

Tags:    

Similar News