సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.

Update: 2024-06-23 13:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల అప్ గ్రేడేషన్ సమస్యను పరిష్కరించడంతో పాటు సుదీర్ఘమై సమస్యలకు ముఖ్యమంత్రి పరిష్కారం చూపించారని ఈ సందర్భంగా సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. టీచర్లకు పదోన్నతలు, బదిలీలు కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా టీచర్ల పదోన్నతికి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే పచ్చ జెండా ఊపారు. దీంతో 10,449 మందికి ఎస్‌ఏలుగా, 778 మంది గెజిటెట్‌ ప్రధానోపాధ్యాయులుగా, 6 వేల మంది ఎస్‌జీటీలు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు.

Tags:    

Similar News