Kishan Reddy : ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలు : శ్రేణులతో కిషన్ రెడ్డి కీలక చర్చలు

గత మూడేళ్లుగా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నట్లుగానే ఈ ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు.

Update: 2024-09-03 09:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గత మూడేళ్లుగా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నట్లుగానే ఈ ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. ఇవాళ భారతీయ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలపై పార్టీ శ్రేణులతో ఆయన చర్చించారు.

మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద బీభత్సంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, వరదలతో జరిగిన నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సహాయ చర్యలు అందించేందుకు బీజేపీ శ్రేణులు అందుబాటులో ఉండాలని కోరారు. వరద బాధితులను అవసరమైన సహాయసహకారాలు అందించడంలో బీజేపీ శ్రేణులు కృషి చేస్తున్న వారికి అభినందనలు తెలిపారు.


Similar News