ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్.. కేంద్రం ముందు కోరికల చిట్టా

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. హోంమంత్రి సమావేశం తర్వాత ప్రధానితో భేటీ అయి పలు విషయాలపై చర్చించనున్నారు.

Update: 2024-10-07 05:03 GMT

దిశ, వెబ్ డెస్క్: దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించే సమావేశానికి హాజరుకానున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులను కలిసి.. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యేందుకు అపాయింట్ మెంట్ కోరారు. ప్రధానితో భేటీలో రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సంభవించిన వరదల గురించి వివరించి.. వరద నష్ట సహాయాన్ని పెంచాలని కోరనున్నారని సమాచారం. అలాగే ఈ మధ్యే మొదలుపెట్టిన మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి నిధులు సమకూర్చాలని, ఇంకా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని విషయాలపై చర్చించి.. కేంద్రం నుంచి కావలసిన సహాయాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది.


Similar News