మంత్రి దామోదర రాజా నర్సింహకు టీచర్ సంఘాల స్పెషల్ రిక్వెస్ట్.. ఏ విషయంలో అంటే..?

గత బీఆర్ఎస్ పభుత్వంలో విడుదల చేసిన జీవో 317 అమలుతో స్థానికత కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నాన్ స్పౌజ్ ఉపాధ్యాయులను తిరిగి వారి సొంత జిల్లాలకు పంపాలని కోరుతూ 317 జీవో సబ్ కమిటీ చైర్మన్, మంత్రి దామోదర రాజా నర్సింహాకు బుధవారం తెలంగాణ నాన్ స్పౌజ్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేసారు.

Update: 2024-07-17 14:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గత బీఆర్ఎస్ పభుత్వంలో విడుదల చేసిన జీవో 317 అమలుతో స్థానికత కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నాన్ స్పౌజ్ ఉపాధ్యాయులను తిరిగి వారి సొంత జిల్లాలకు పంపాలని కోరుతూ 317 జీవో సబ్ కమిటీ చైర్మన్, మంత్రి దామోదర రాజా నర్సింహాకు బుధవారం తెలంగాణ నాన్ స్పౌజ్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేసారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సక్కు బాయి మీడియాతో మాట్లాడుతూ.. జీవో 317 అమలు వల్ల 33 జిల్లాలో స్థానికత కలిగిన జిల్లాలను బలవంతంగా కోల్పోయి కుటుంబాలకు దూరంగా పనిచేస్తూన్నారని తెలిపారు.

ఇందులో ఎక్కువ శాతం నాన్ స్పౌజ్ ఉపాధ్యాయులున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియారిటీలో నష్టం జరిగిందని పేర్కొన్నారు. చాలా మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు జూనియర్లు కావడం చేత సీనియర్లు తమకు నచ్చినటువంటి పట్టణ ప్రాంతాలకు రావడం మూలంగా జూనియర్ ఉద్యోగులను జిల్లాలకు బదిలీ చేసారని తెలిపారు. ఏ అవకాశం లేని భార్యాభర్తల అయిన సింగిల్ ఎంప్లాయిస్‌కి ఏ కాలము, ప్రాధాన్యత క్రమము లేకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, సహ కార్యదర్శి సావిత్రి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సిద్ధం శ్రీనివాస్ పాల్గొన్నారు.


Similar News