రేవంత్ సర్కార్‌ను ఇరుకునపెట్టేందుకు టీ-బీజేపీ భారీ స్కెచ్.. 15 అంశాలతో రాజకీయ తీర్మానం

అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు టీ-బీజేపీ సిద్ధం అయ్యింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలనూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని

Update: 2024-07-12 10:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు టీ-బీజేపీ సిద్ధం అయ్యింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలనూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాషాయ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం శంషాబాద్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలపై 15 అంశాలతో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రవేశపెట్టగా.. ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు బలపర్చారు. రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా ఉన్న నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేయాలనే అంశాన్ని ఈ తీర్మానంలో బీజేపీ పొందుపర్చించింది. 

Tags:    

Similar News