తెలుగు విశ్వవిద్యాలయంకు పాల్కురికి సోమనాథుని పేరు పెట్టండి : సోమనాథ కళా పీఠం విజ్ఞప్తి

తెలుగు విశ్వవిద్యాలయంకు తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుని పేరు పెట్టాలని సోమనాథ కళా పీఠం సాహిత్య సాంస్కృతిక వేదిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది

Update: 2024-08-05 14:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు విశ్వవిద్యాలయంకు తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుని పేరు పెట్టాలని సోమనాథ కళా పీఠం సాహిత్య సాంస్కృతిక వేదిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు అంశాన్ని ఇటీవల శాసనసభలో ప్రస్తావించిన అంశాన్ని గుర్తు చేస్తూ.. తెలంగాణ మలిదశ ఉద్యమం నాటి నుంచీ తెలంగాణ వాదులు ఈ విశ్వవిద్యాలయానికి పాల్కురికి సోమనాథుని పేరు పెట్టాలని బలంగా కోరుతున్నారని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చటానికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకోగలరని పీఠం విశ్వాసం వ్యక్తం చేసింది. సురవరం ప్రతాపరెడ్డి పేరును పాలమూరు విశ్వవిద్యాలయానికి పెట్టవచ్చునని సూచించింది. సాహిత్యాభిమానులు, సబ్బండ వర్గాలు, సమస్త రాజకీయ పక్షాలు ప్రభుత్వానికి తెలియ చెప్పి తెలుగు విశ్వవిద్యాలయానికి పాల్కురికి సోమనాథుని పేరు పెట్టించాలని పీఠం పిలుపు నిచ్చింది. సమావేశంలో గౌరవ సలహాదారు వీరమనేని వెంకటేశ్వర్ రావు, అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


Similar News