నాగర్ కర్నూల్ జిల్లాలో కొండచిలువ సంచారం కలకలం..

నాగర్ కర్నూల్ జిల్లాలో కొండచిలువ సంచారం కలకలం రేపుతోంది.

Update: 2024-07-21 03:43 GMT

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో కొండచిలువ సంచారం కలకలం రేపుతోంది. శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోని రవి టాకీస్ పక్కనే ఉన్న పాత ఇనుప సామాను గోదాంలో సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. తమ మొబైల్ ఫోన్లో వీడియోలు తీసి వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తున్నారు. దీంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు నాలుగు అడుగుల కొండచిలువ ఇక్కడికి ఎలా వచ్చింది..?అని స్థానికులు చర్చించుకుంటున్నారు .గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు బయటకు వచ్చి ఉండవచ్చని తెలుస్తోంది.

Tags:    

Similar News