సింగరేణి భారీ విరాళం.. సీఎం రేవంత్‌కి రూ.10.25 కోట్ల చెక్‌ అందజేత

తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి(CM Relief Fund)కి సింగరేణి(Singareni) యాజమాన్యం భారీ విరాళం ప్రకటించింది.

Update: 2024-09-19 14:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి(CM Relief Fund)కి సింగరేణి(Singareni) యాజమాన్యం భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన రూ.10 కోట్లను గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి చెక్కు రూపంలో కార్మిక సంఘాల నేతలతో కలిసి సింగరేణి ఎండీ బలరాం అందజేశారు. కాగా, సెప్టెంబర్ మొదటి వారంలో భారీ వర్షాలు పడడంతో తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడ ప్రాంతాలు వరదలతో నీట మునిగాయి. దాదాపు వారం రోజుల పాటు బాధితులు నీళ్లల్లోనే ఉండిపోయారు. ఈ క్రమంలోనే బాధితులను ఆదుకునేందుకు అనేక మంది ముందుకొచ్చి సాయం చేస్తున్నారు.


Similar News