నీ ఆస్తుల లెక్క తేలుద్దామా..? జగదీశ్ రెడ్డికి వేముల వీరేశం సవాల్

రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పాలనలో అనేక స్కాములు జరిగాయని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు.

Update: 2024-06-27 10:27 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పాలనలో అనేక స్కాములు జరిగాయని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. అవినీతిపై విచారణ కమిషన్లను వేయగానే పోరాడే తత్వం ఉన్న మాజీ సీఎం కేసీఆర్ దొడ్డిదారిని ఎందుకు వెతుక్కుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి వేముల వీరేశం సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. విద్యు్త్ కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు, అవినీతి జరగలేదని, అవసరమైతే జ్యుడీషియల్ విచారణ చేసుకోవాలని నాడు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారని వేముల గుర్తు చేశారు. కేసీఆర్ డైరెక్షన్‌లో మాట్లాడిన జగదీశ్ రెడ్డి నేడు ఆ ఇద్దరు విచారణకు హాజరు కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేపీఆర్ చెప్పకుండానే జ్యుడీషయల్ విచారణ కోరారా అని జగదీశ్ రెడ్డిని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అంధకారంలో నెట్టి ప్రయత్నం చేసిందని వేముల విమర్శించారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి 2014లో ఎంత ఆస్తి ఉంది.. మంత్రి అయ్యాక ఎంత ఆస్తి ఉందని ప్రశ్నించారు. ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ జగదీశ్ రెడ్డికి వేముల సవాల్ విసిరారు. అసత్యాలు మాట్లాడితే అవి నిజమైపోవన్నారు. రెండు రోజులుగా జగదీశ్ రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగదీశ్ రెడ్డి అవినీతికి పాల్పడకపోతే తనదో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.  


Similar News