T PCC: అదంతా మా ఇంటర్నల్ మేటర్.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-16 09:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కొండా సురేఖ వర్సెస్ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం టీ కాంగ్రెస్ లో రోజురోజుకు ముదురుపాకాన పడుతున్నది. ఈ నేపథ్యంలో  ఈ వివాదంపై తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో భేటీ అయి మంత్రి కొండా సురేఖపై ఫిర్యాదు చేశారు. నేతల భేటీపై స్పందించిన పీసీసీ చీఫ్.. ఎమ్మెల్యేలు ఇతర విషయంపై చర్చించేందుకు నను కలిశారని, ఇదే సందర్భంలో వరంగల్ కాంగ్రెస్ లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై చెప్పారన్నారు. ఇదంతా తమ అంతర్గత వ్యవహారం అని ఏది ఉన్నా తాము సరిచేసుకుంటామన్నారు. కార్యకర్తల అత్యుత్సాహంతో నేతల మధ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. సమస్యలను పరిష్కరించుకోవాలని ఇప్పటికే నేతలకు సూచించినట్లు మహేశ్ కుమార్ గౌడ్ ప్రస్తావించారు.  


Similar News