ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ఏర్పాటుపై జీవో విడుదల చేసిన సర్కార్

తెలంగాణ సర్కార్ మరో ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది.

Update: 2024-10-11 12:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సర్కార్ మరో ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్(Congress) ఎన్నికల ఆరు గ్యారంటీల హామీల్లో ప్రధానమైనది ఇందిరమ్మ ఇళ్ళు(Indiramma Houses). పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇళ్ళ లబ్దిదారులను గుర్తించేందుకు ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. గ్రామపంచాయితీల్లో, మున్సిపల్ వార్డు స్థాయిల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం జీవోలో పేర్కొంది. గ్రామస్థాయిల్లో సర్పంచ్ లేద ప్రత్యేక అధికారి చైర్ పర్సన్ ఉండగా.. మున్సిపాలిటీ స్థాయిల్లో కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్ పర్సన్ గా ఉండనున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్ కన్వీనర్ గా పంచాయితీ కార్యదర్శి, వార్డ్ ఆఫీసర్ ఉంటారు. అలాగే కమిటీలో ఇద్దరు ఎస్ హెచ్జీ సభ్యులు, ముగ్గురు స్థానికులు ఉండనున్నారు.  కాగా ఈ కమిటీలు శనివారం నాటికి ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు అందాయి. కమిటీల కోసం పేర్లు పంపాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ కమిటీలు ఇందిరమ్మ ఇళ్ల అర్హులకు అవగాహన కల్పించడంతోపాటు, అనుమానాలు నివృత్తి చేస్తారు.

  




 


Tags:    

Similar News