గ్రూప్-1 ప్రిలిమినరీ రాయడానికి వెళ్తున్నారా? మీకోసం ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యాలు.. తెలుసా?

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం టీజీఎస్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అభ్యర్థులకు ఆదివారం రవాణా పరంగా అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఎక్స్ వేదికగా సజ్జనార్ వెల్లడించారు.

Update: 2024-06-08 08:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం టీజీఎస్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అభ్యర్థులకు ఆదివారం రవాణా పరంగా అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఎక్స్ వేదికగా సజ్జనార్ వెల్లడించారు. రాష్ట్రంలోని 897 పరీక్షా కేంద్రాలకు బస్సులను నడపాలని క్షేత్రస్థాయి ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే సంస్థ యాజమాన్యం ఆదేశాల్విడం జరిగింది.

రాజధాని హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు ఈ రోజు సాయంత్రం నుంచే అభ్యర్థుల రద్దీ ఎక్కువగా ఉన్నందున.. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ పాయింట్లలో తగు ఏర్పాట్లును సంస్థ చేసింది. ఆయా ట్రాఫిక్‌ జనరేటింగ్‌ పాయింట్లలో ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను వారు అందుబాటులో ఉంచుతారు. రాష్ట్రంలోని ప్రధాన బస్‌ స్టేషన్లలో 'May I Help You' కౌంటర్లను సంస్థ ఏర్పాటు చేసింది. అక్కడ పరీక్షా కేంద్రాల సమాచారాన్ని అభ్యర్థులకు ఇవ్వడంతో పాటు ఏ బస్సులో వెళ్లాలో అధికారులు చెప్తారు.

రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది విద్యార్థులు గ్రూప్-1 ప్రిలిమినరీకి హాజరవుతుండగా.. అందులో గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే దాదాపు 1.70 లక్షల మంది రాస్తున్నారు. వారికి రవాణా పరంగా అసౌకర్యం కలగకుండా రద్దీకి అనుగుణంగా సిటీ బస్సులను అందుబాటులో ఉంచడం జరిగింది. ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా పరీక్షా కేంద్రాలకు వెళ్లి.. ప్రశాంత వాతావరణంలో గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష రాయాలని కోరుతూ.. అభ్యర్థులకు సజ్జనార్ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

Tags:    

Similar News