ఆర్టీసీ ఆన్ లైన్ సర్వే.. ఐటీ ఉద్యోగులకు సజ్జనార్ కీలక విజ్ఞప్తి

టీజీఎస్ ఆర్టీసీ ఆన్ లైన్ సర్వే చేపట్టింది.

Update: 2024-07-03 12:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టీసీని మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో సంస్థలో వినూత్న ప్రయోగాలు చేస్తున్న టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా ఐటీ కారిడార్ పై ఫోకస్ పెట్టారు. ఐటీ కారిడార్ లో మెరుగైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు ఆర్టీసీ ఓ సర్వేను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఈ సర్వే లింకులు సజ్జనార్ ఎక్స్ (ట్విట్టర్) లో షేర్ చేశారు. ఈ లింక్ ను ఉపయోగించుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో పాటు ఐటీ కారిడార్ కు రాకపోకలు సాగించే ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను ఆర్టీసీకి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణ సమాచారంతో పాటు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ సర్వేలో వచ్చిన సమాచారాన్ని బట్టి ఐటీ కారిడార్ లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News