నష్టపోయిన రైతులకు సీఎం రేవంత్ భరోసా
వరదల్లో నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి రూ.10 వేలు నష్టపరిహారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
దిశ, వెబ్ డెస్క్ : వరదల్లో నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి రూ.10 వేలు నష్టపరిహారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నేడు ఖమ్మంలోణి వరద ప్రాంతాల్లో పర్యటించిన సీఎం.. అనంతరం వివిధ శకాహాల మంత్రులతో కలిసి సమీక్ష నిర్వహించారు. వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని వరద పర్యటనలో స్వయంగా రేవంత్ రెడ్డి హామీ ఇవ్వగా.. నష్టపరిహారం వివరాలు ప్రకటించారు. పంట పొలాలు నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి రూ.10 వేల చొప్పున ఎన్ని ఎకరాలకైనా అందిస్తామని అన్నారు. ఇక వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం అందిస్తామని పేర్కొన్నారు. అలాగే ఇండ్లు కోల్పోయిన వారికి తక్షణమే ఇందిరమ్మ ఇల్లు వచ్చే ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.