Revanth Reddy: సీఎం సహాయ నిధికి భారీ విరాళం.. రూ.5 కోట్ల చెక్కును అందజేసిన ప్రముఖ వ్యాపారవేత్త

ప్రముఖ వ్యాపార వేత్త రవి రహేజా తెలంగాణ సీఎం సహాయ నిధికి భారీ విరాళం అందజేశారు.

Update: 2024-09-07 10:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ వ్యాపార వేత్త రవి రహేజా తెలంగాణ సీఎం సహాయ నిధికి భారీ విరాళం అందజేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి 5 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల భారీ స్థాయిలో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. దీంతో వరద బాధితులను ఆదుకునేందకు పలువురు సినీ, వ్యాపార, రాజకీయ వేత్తలు ముందుకు వస్తున్నారు. ఎవరికి వారు వారికి తోచినంత సీఎం సహాయ నిధికి విరాళాలుగా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ వ్యాపార వేత్త, చాలెట్ హోటల్స్ నిర్వాహాకులు రవి రహేజా భారీ విరాళం ప్రకటించారు. ఐదు కోట్ల రూపాయలను సీఎం సహాయనిధికి అందిస్తున్నట్లు తెలిపారు. దీనికోసం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి 5 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. కాగా రవి రహేజా, నీల్ రహేజా సోదరులు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, రిటైల్ మాల్స్, హోటల్స్ సహా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.  


Similar News