JNTUH: క్యాంపస్ మెస్ చట్నీలో ఈత కొడుతున్న ఎలుక..! వీడియో వైరల్

సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ జేఎన్టీయూహెచ్ కాలేజీ క్యాంపస్‌ మెస్‌లోని చట్నీలో ఎలుక దర్శనమిచ్చింది.

Update: 2024-07-09 06:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ జేఎన్టీయూహెచ్ కాలేజీ క్యాంపస్‌ మెస్‌లోని చట్నీలో ఎలుక దర్శనమిచ్చింది. ఇది చూసిన విద్యార్థులు అందరూ షాక్‌కు గురయ్యారు. చట్నీలో ఎలుక అటు ఇటు తిరుగుతూ ఈ కొడుతున్నది. వెంటనే విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, ఎలుకను చూసిన విద్యార్థులు నిర్వాహకులపై ఫైర్ అయ్యారు. ఇలాంటి ఆహారాలు తింటే ఫుడ్ పాయిజన్‌కు లోనవుతామని ఆవేదన వ్యక్తంచేశారు. చట్నీపై మూతపెట్టకపోవడంతోనే ఎలుక పడిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వచ్ఛత లేని ఆహారం తిని విద్యార్థులు అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయని, ఈ క్రమంలోనే యాజమాన్యం నిర్లక్ష్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్‌గా మారింది.

కొందరు విద్యార్థులు కావాలనే చేశారు: ప్రిన్సిపాల్

చట్నీలో ఎలుక ఘటనపై స్పందించిన కళాశాల ప్రిన్సిపాల్‌ స్పందించారు. తినేందుకు తయారు చేసిన చట్నీలో ఎలుక పడలేదని, శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక పడిందని కళాశాల ప్రిన్సిపల్‌ పేర్కొన్నారు. పాత్రలో ఉన్న ఎలుకను వీడియో తీసి వైరల్‌ చేశారని, కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపారని ప్రిన్సిపాల్‌ నరసింహ స్పష్టంచేశారు.

Tags:    

Similar News