సాధన కుటీర్ ను సందర్శించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం..

గతేడాది ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని వినోభానగర్ లో జ్ఞానసరస్వతి ఫౌండేషన్ సాధన కుటీర్ పురాతన కట్టడాలను ముందస్తు సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ కమిషనర్ యూసుఫ్ కూల్చివేశారని ఆరోపిస్తూ జీఎస్ఎఫ్ సభ్యులు లోకాయుక్తని సంప్రదించారు.

Update: 2023-03-02 13:52 GMT

దిశ, యాచారం : గతేడాది ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని వినోభానగర్ లో జ్ఞానసరస్వతి ఫౌండేషన్ సాధన కుటీర్ పురాతన కట్టడాలను ముందస్తు సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ కమిషనర్ యూసుఫ్ కూల్చివేశారని ఆరోపిస్తూ జీఎస్ఎఫ్ సభ్యులు లోకాయుక్తని సంప్రదించారు. ఈ నేపథ్యంలో గురువారం ఐదుగురితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం కూల్చివేసిన పురాతన కట్టడాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మాట్లాడుతూ అతి త్వరలో పూర్తి నివేదికను లోకాయుక్త జడ్జికి సమర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జీఎస్ఎఫ్ వ్యవస్థాపకుడు సదా వెంకట్ రెడ్డి , మునిషపల్ కమీషనర్ యూసుఫ్, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.

Tags:    

Similar News