జర్దా తయారీ కేంద్రంపై మహేశ్వరం ఎస్ఓటి పోలీసుల దాడులు
జర్దా తయారీ కేంద్రంపై మహేశ్వరం ఎస్ఓటి పోలీసులు బాలాపూర్ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు.
దిశ, బడంగ్ పేట్ : జర్దా తయారీ కేంద్రంపై మహేశ్వరం ఎస్ఓటి పోలీసులు బాలాపూర్ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. జర్దా తయారీ చేస్తున్న ముగ్గురిని రెడ్ హ్యాండెడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలలోకి వెళితే ... చార్మినార్ కు చెందిన సయ్యద్ ఇర్ఫాన్ (45) గత కొంత కాలంగా బాలాపూర్ లోని వాదియే ఉమర్ కాలనీలో జర్దా తయారీ కేంద్రాన్ని నడుపుతున్నాడు. ఈ కేంద్రంలో బండ్లగూడ కు చెందిన హరిశంకర్ రాజ్పూత్, విక్రమ్ సింగ్ పర్మార్ లు లేబర్లుగా పనిచేస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం మహేశ్వరం ఎస్ఓటి పోలీసులు బాలాపూర్ పోలీసులతో కలిసి వాదియే ఉమర్ కాలనీలోని జర్దా తయారీ కేంద్రంపై దాడులు చేశారు. వారి వద్ద నుంచి 18 కిలోల ఎర్ర జర్దా పొడి, ఒక కిలో మెంతి (పుదీనా), 2 కిలోల హిమామ్ ద్రవం, 4 లీటర్ల రోజ్ వాటర్ బాటిల్, 46,560 టొబాకో స్టాచెట్, 2 గోల్డ్ స్టాచెట్ రోలర్స్, 4 గోల్డ్ ఖాళీ బాక్సులు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 1, వెయింగ్ మిషన్ 1, ప్యాకింగ్ మిషన్స్ 2, ప్లాస్టిక్ ప్యాకింగ్ కవర్స్ 2 కిలోలు, మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.