ఆరోజు రేవంత్ రెడ్డిపై కేసు ఎందుకు పెట్టారు?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2024-08-21 13:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జన్వాడ ఫామ్‌హౌజ్‌‌పై గతంలో డ్రోన్లు ఎగరేశాడని రేవంత్ రెడ్డిపై కేసు పెట్టారు. మరి ఫామ్‌హౌజ్ కేటీఆర్‌ది కానప్పుడు కేసు ఎందుకు పెట్టారు. తనది కాదని అప్పుడే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇప్పుడు తన వరకూ వచ్చాక కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కతున్నారని విమర్శించారు. మరోవైపు జన్వాడ ఫామ్‌హౌజ్ కూల్చొద్దంటూ ఆ ఫామ్ హౌజ్‌ యజమాని ప్రదీప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఫామ్‌హౌజ్ కూల్చివేయకుండా స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని హైడ్రాకు సూచించింది. వాదనల సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిధి గురించి చెప్పాలని ఏఏజీని ధర్మాసనం కోరింది.

Tags:    

Similar News