Ponnam Prabhakar: దసరా కైనా మీకు మంచి బుద్ధి రావాలి.. కేటీఆర్ కు పొన్నం కౌంటర్

పదవి పోయిన అసహనంతో కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఘాటు రియాక్షన్ ఇచ్చారు.

Update: 2024-10-09 06:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నదని.. విద్యార్థి, నిరుద్యోగులు మా ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ విషయంలో రాహుల్ గాంధీపై సెటైర్ వేస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ కు పొన్నం రియాక్ట్ అయ్యారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఇద్యోగాలు ఇచ్చిందని కౌంటర్ ఇచ్చారు. బుధవారం గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమానికి పొన్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన ఆయన పదవి పోయిన అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరికి తెలుసన్నారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రతిపక్ష హోదాలో ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని, ఈ ప్రభుత్వాన్ని దించేస్తామని శాపనార్థాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఈ దసరా పండగ సందర్భంగానైనా వారి మనసు మారాలని భగవతుడిని కోరుతున్నాన్నారు. కేంద్రం నుంచి వరద సహాయం సాధించే విషయంలో ప్రతిపక్షం సహకరించాలన్నారు. ప్రతిపక్షాల సలహాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత ప్రభుత్వం 150 మందికి విదేశీ విద్యానిధి ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 500 మందికి విదేశీ విద్యానిధి ఇస్తోందన్నారు.

జగదీశ్ రెడ్డి పదేళ్లు ఏం చేశావ్?:

మూసీ విషయంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పొన్నం ఖండించారు. రెండు ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా బీఆర్ఎస్ కు బుద్ధిరాలేదని అందుకే పది నెలలైనా కానీ మా పాలనపై చర్చకు రావాలని జగదీశ్ అంటున్నారని మండిపడ్డారు. జగదీశ్ రెడ్డి మా పది నెలల ప్రభుత్వంపై కాకుండా మీరు పదేళ్లు ఏం చేశారో ఆలోచన చేసుకోవాలన్నారు. మూసీ నిర్వాసితులకు పునరావసం కల్పించాకే ఖాళీ చేస్తున్నామన్నారు. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు వారి పిల్లల చదువులకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీసీ సంక్షేమ శాఖ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వశాఖ ద్వారా కులగణన చేపట్టబోతున్నామన్నారు.


Similar News