'జై పాలస్తీనా' స్లోగన్.. ఓవైసీకీ రాజాసింగ్ కౌంటర్

ఓవైసీకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-06-25 12:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ ఎంపీగా ఇవాళ లోక్ సభలో ప్రమాణ స్వీకారం సందర్భంగా జై పాలస్తీనా అంటూ  ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన నినాదం దుమారంగా మారింది. అసద్ స్లోగన్ పై ఎన్డీయే కూటమి నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా అసద్ కామెంట్స్ పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు మంగళవారం ఓ వీడియోను రిలీజ్ చేసిన రాజాసింగ్.. పాలస్తీనాపై అంత ప్రేమ ఉంటే, వారి కోసం తాపత్రయం నిజం అయితే ఓవైసీ భారత్ విడిచి పాలస్తీనాకు వెళ్లి తుపాకి పట్టుకోవాలని సూచించారు. ఒక్కసారి పాలస్తీనాకు వెళితే మీ మీ లాంటి వారి పరిస్థితి ఏంటో సరిగ్గా అర్థం అవుతుదని కామెంట్ చేశారు. భారత దేశంలో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేస్తూ భారత్ మాతాకీ జై, జై భారత్ అని నినాదాలు చేయడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారని మండిపడ్డారు. లోక్ సభలో ప్రమాణ స్వీకారం ఏ ప్రకారం చేస్తోరో మీకు చెప్పడానికి మీరు కొత్త సభ్యులేమి కాదని ఆ అవసరం కూడా మీకు లేదన్నారు. అదే మీ స్థానంలో ఉండి ఎవరైనా జై ఇజ్రాయిల్ అంటే ఊరుకునేవారా? బయటకు వచ్చి నానా హంగామా చేసేవారు కదా అని నిలదీశారు. మీడియాలో హెడ్ లైన్స్ లో కనిపించేందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. జై భీమ్ అని తాము కూడా అంటామని కానీ సభలో జై పాలస్తీనా అని అనడం ఆలోచించాల్సిన విషయం అన్నారు.

Tags:    

Similar News