Waqf Amendment Bill : వక్ఫ్ భూముల సవరణ బిల్లుపై అభిప్రాయ సేకరణ.. నగరంలో జేపీసీ భేటీ

వక్ఫ్ భూముల సవరణల బిల్లుపై అభిప్రాయ సేకరణ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తెలంగాణలో పర్యటన చేపట్టింది.

Update: 2024-09-28 09:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వక్ఫ్ భూముల సవరణల బిల్లు పై అభిప్రాయ సేకరణ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తెలంగాణలో పర్యటన చేపట్టింది. శనివారం హైదరాబాద్ తాజ్ కృష్ణ‌లో జేపీసీ చైర్పర్సన్ జగదాంబికా పాల్ ఆధ్వర్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. జేపీసీ ముందు తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు వినిపించారు.

ఈ సందర్భంగా తెలంగాణలో తమ తమ పార్లమెంట్ పరిధిలోని వక్ఫ్ భూముల సమస్యలను జేపీసీ దృష్టికి తీసుకువస్తూ సవరణ బిల్లుకు బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ మద్దతు తెలిపారు. తమ పార్లమెంట్ పరిధిలోని వక్ఫ్ భూముల వివాదాలకు సంబంధించి జేపీసీ చైర్పర్సన్‌కు బీజేపీ ఎంపీలు వినతి పత్రం అందజేశారు.


Similar News