ఆ ఫ్లై ఓవర్‌ను ప్రజలే తెరుచుకోండి.. KTR సంచలన పిలుపు

గోపన్ పల్లి ఫ్లై ఓవర్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

Update: 2024-07-12 08:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: గోపన్ పల్లి ఫ్లై ఓవర్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. మనకు పనికిమాలిన ప్రభుత్వం, అవగాహన లేని నాయకత్వం ఉన్నప్పుడు ఇలానే జరుగుతుందన్నారు. నల్లగండ్ల, గోపన్ పల్లి, తెల్లాపూర్, చందానగర్ చుట్టుపక్కల వాసులకు ఉపశమనం కలిగించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన గోపన్ పల్లి ఫ్లై ఓవర్ కొన్ని నెలల క్రితమే పూర్తయింది. కానీ నేటికి ఇది ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఎందుకంటే ఢిల్లీలోని బాసులను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇళ్లకు వెళ్లే పనిలో సీఎం బిజీగా ఉన్నారు. ప్రజల సౌకర్యానికి కన్నా కాంగ్రెస్ నాయకులకు పర్సనల్ పీఆర్ ముఖ్యమన్నారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ ఫ్లై ఓవర్‌ను తెరవాలని లేని పక్షంలో ప్రజలే ఫ్లై ఓవర్‌ను ఓపెన్ చేసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.  


Similar News