తీవ్ర విషాదం...ఎస్సారెస్పీ రిజర్వాయర్ లో మునిగి ముగ్గురు దుర్మరణం

మెండోరా మండలంలోని ఎస్సారెస్పీ రిజర్వాయర్ లో ముగ్గురు యువకులు మృతి చెందారు.

Update: 2024-03-08 13:53 GMT

దిశ, జక్రాన్ పల్లి : మెండోరా మండలంలోని ఎస్సారెస్పీ రిజర్వాయర్ లో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఆటవిడుపుగా స్నానాలు చేసేందుకు దిగి రిజర్వాయరులో మునిగి మృత్యువాత పడ్డారు. రెవెన్యూ అధికారులు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. జక్రాన్ పల్లి మండలంలోని గన్య తండాకు

     చెందిన సాయినాథ్, లోకేష్, మున్నా అనే ముగ్గురు యువకులు ప్రాజెక్టును సందర్శించి అనంతరం ఎస్సారెస్పీ రిజర్వాయర్ లక్ష్మీకాల్వ హెడ్ రెగ్యులేటర్ ఎగువ భాగాన ఉన్న నీటిలో స్నానాలు చేసేందుకు దిగి గల్లంతయ్యారు. జాలర్ల సహాయంతో చర్యలు చేపట్టి ముగ్గురి మృతదేహాలను వెలికి తిశారు. అనంతరం కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ దావఖానకు తరలించారు.  


Similar News