గ్రామసభలో గందరగోళం..

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో అవకతవకలు జరిగాయని పోతంగల్ గ్రామసభలో సర్పంచ్ తో పాటు గ్రామ యువకులు అధికారులను నిలదీశారు.

Update: 2023-12-24 03:00 GMT

దిశ, కోటగిరి : డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో అవకతవకలు జరిగాయని పోతంగల్ గ్రామసభలో సర్పంచ్ తో పాటు గ్రామ యువకులు అధికారులను నిలదీశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. శనివారం పోతంగల్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. కాగా కొందరు యువకులు గ్రామానికి సంబంధించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు కాకుండా అనర్హులకు ఇచ్చారని, డబుల్ బెడ్ రూమ్ బిల్లుల పైకం లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదని సర్పంచును, అధికారులను నిలదీశారు. కాగా అధికారులు పొంతన లేని సమాధానం చెప్పి మాట దాటి వేయడంతో సభలో గందరగోళం నెలకొంది.

Tags:    

Similar News